దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో మోదీతో భారతీయ ప్రతినిధుల బృందం - చిత్రంలో నీరవ్ మోదీ కూడా ఉన్నారు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.11,500 కోట్ల కుంభకోణం దేశంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.11,500 కోట్ల కుంభకోణం దేశంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసిన అనంతరం వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహించారు.
1. నీరవ్ మోదీ దావోస్లో ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఏం చేస్తున్నారు?
2. ప్రధాని కళ్ల ముందే అంత పెద్ద బ్యాంకు లూటీకి గురైంది. దానికి ఎవరు బాధ్యులు?
3. ప్రధానికి ఈ విషయంపై గత జూలైలోనే సమాచారం అందింది. మరెందుకు ఎవరిపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?
4. మొత్తం వ్యవస్థంతా ఎలా మోసపోయింది? ప్రతి ఆడిటర్, ప్రతి అధికారి కళ్ల ముందు నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా దారిమళ్లాయి? దీన్ని బట్టి చూస్తే ఎవరో ఒక పెద్ద మనిషి అండ ఈ కుంభకోణం వెనక ఉందని అర్థమవుతోంది. మోదీజీ.. ఎవరా వ్యక్తి?
5. దేశానికి చెందిన మొత్తం బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ, మోసాల్ని అరికట్టే వ్యవస్థ అలా ఎలా విఫలమైంది? మోదీజీ... సమాధానం చెప్పండి.
Comments
Post a Comment