మన దేశం లో విద్య ,వైద్యం ఉచితం గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది .అది రాజ్యాంగం కలిపించిన నైతిక బాధ్యత . కానీ దాని గురించి దేశం లో ఏ ప్రభుత్వం పాటించిన దాఖలాలు లేవు . నాణ్యమైన విద్యని అందించలేని దీన స్థితి లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలు మాత్రమేనా .. ?
ప్రభత్వాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి అంటే అది నిజం గా పొరపాటే ఎందుకంటే
ప్రశ్నించాల్సిన మీడియా కూడా వాటి గురించి మాట్లాడాల్సిన సందర్భాలు లేవు .
ఎందుకంటే ఆ మీడియా సంస్థలను నడుపు తున్నది ఆ రాజకీయ నాయకులే కదా .....
ప్రైవేట్ స్కూళ్ల లో పిల్లలను చదివించాలి అంటే 30000 ల నుంచి 100000 వరకు ఖర్చు అవుతుంది. దీనిని తప్పు అని ప్రశ్నించలేని మీడియా ...
ఒకటి గుర్తించండి .. ...... ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి గెలిపిస్తే . ....
వాళ్లేమో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల లో, బయటదేశాలలో చదివిస్తున్నారు . ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తునారు .
దీని బట్టి మనకి ఏమి తెలుస్తుంది వీళ్ళు వారి పిల్లలను కూడా చదివిపించుకోలేని స్థితి లో ఉన్నారు అని .
ఉదాహరణకి చంద్రబాబు నాయడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటూ ఆయన కొడుకు ని కూడా ఈ దేశం లో చదివించుకోలేక పోయాడు .అలాగే వైస్ రాజశేఖర్ రెడ్డి గారు
ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి గారిని , ఆ తరువాత జగన్ గారు ఆయన కూతురుని కూడా బయట దేశంలో చదివించుకునే దుస్థితి ఏర్పడింది .
దీని ప్రశ్నించాల్సిన జర్నలిజం నిద్ర పోతు ఉంది .
Comments
Post a Comment